S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

04/24/2016 - 06:38

చెన్నై, ఏప్రిల్ 23: రాబోయే మూడేళ్లలో భారత జిడిపి వృద్ధిరేటు 8-10 శాతాన్ని అందుకోగలదన్న విశ్వాసాన్ని ముఖ్య ఆర్థిక సలహాదారు అర్వింద్ సుబ్రమణ్యన్ వ్యక్తం చేశారు. ‘్ఫబ్రవరిలో మేము విడుదల చేసిన ఆర్థిక సర్వేలో దేశ జిడిపి వృద్ధిరేటు 7-7.75 శాతం మధ్య ఉంటుందని అంచనా వేశాం. మూడేళ్లలో ఇది 8-10 శాతం వృద్ధికి ఎగబాకుతుంది.’ అన్నారు.

04/24/2016 - 06:37

టోరంటో, ఏప్రిల్ 23: మీడియా, ఎంటర్‌టైన్‌మెంట్ రంగాలకు అందించిన విశేష సేవలకుగాను ఎస్సెల్, జీ గ్రూప్ చైర్మన్ సుభాష్ చంద్ర.. గ్లోబల్ ఇండియన్ అవార్డు అందుకున్నారు. కెనడా ఇండియా ఫౌండేషన్ (సిఐఎఫ్) ఈ అవార్డును ప్రకటించగా, కెనడా నూతన, శాస్త్ర, ఆర్థికాభివృద్ధి శాఖ మంత్రి నవదీప్ బెయిన్స్ ఓ ట్రోఫి, 50,000 డాలర్ల నగదును సుభాష్ చంద్రకు అందించారు.

04/24/2016 - 06:37

న్యూఢిల్లీ, ఏప్రిల్ 23: దేశీయ ప్రైవేట్‌రంగ టెలికామ్ దిగ్గజం భారతీ ఎయిర్‌టెల్.. ఈ నెల 27న షేర్ల బైబ్యాక్ అంశాన్ని పరిశీలించనుంది. ఆ రోజు జరిగే సంస్థ బోర్డు సమావేశంలో ఈ అంశం ప్రస్తావనకు రానుంది. అయితే ఈ బైబ్యాక్ ఆఫర్ ద్వారా ఎన్ని షేర్లను తిరిగి కొనుగోలు చేయనుందనే వివరాలు మాత్రం తెలియరాలేదు.

04/24/2016 - 06:36

న్యూఢిల్లీ, ఏప్రిల్ 23: రియో ఒలింపిక్స్‌లో భారత్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న ఒక్కో అథ్లెట్‌కు కోటి రూపా యల ఉచిత జీవిత బీమాను ఎడెల్‌వీస్ గ్రూప్ సంస్థ అయన ఎడెల్‌వీస్ టోకియో లైఫ్ ఇన్సూరెన్స్ ప్రకటించిం ది.

04/24/2016 - 06:36

విశాఖపట్నం, ఏప్రిల్ 23: విద్యుత్ పంపిణీ నష్టాలు తగ్గించడంలో దేశంలోనే ఈస్ట్రన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ (ఈపీడీసీఎల్) అగ్రగామిగా నిలిచింది. దేశంలో 48 విద్యుత్ పంపిణీ సంస్థలుండగా, అందులో ఈపీడీసీఎల్ ఒక్కటే విద్యుత్ నష్టాలను 5.48 శాతానికి తగ్గించి మొదటి స్థానంలో నిలిచింది.

04/24/2016 - 06:35

న్యూఢిల్లీ, ఏప్రిల్ 23: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని అమెరికాకు చెందిన రుకుస్ వైర్‌లెస్ సంస్థ అధ్యక్షురాలు, సిఇఒ సెలినా లో శనివారం కలుసుకు న్నారు. ప్రధాని కార్యాలయం ఈ మేరకు ఓ ప్రకటనలో తెలియజేసింది. 2004లో వ్యాపార కార్యకలాపాలు ప్రారంభించిన ఈ సంస్థ.. నేడు వైర్‌లెస్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మార్కెట్‌కే దిక్సూచిగా కొనసాగుతోంది.

04/24/2016 - 06:33

న్యూఢిల్లీ, ఏప్రిల్ 23: దేశీయ ప్రైవేట్‌రంగ విమానయాన సంస్థ జెట్ ఎయిర్‌వేస్‌లో జెట్‌లైట్ విలీనానికి లైన్‌క్లియరైంది. జెట్ ఎయిర్‌వేస్ భాగస్వాములు ఇందుకు అంగీకరించారు. నిరుడు సెప్టెంబర్‌లో జెట్ ఎయిర్‌వేస్‌లో దాని అనుబంధ సంస్థ జెట్‌లైట్‌ను విలీనం చేయాలని ప్రతిపాదించారు.

04/23/2016 - 04:55

న్యూఢిల్లీ, ఏప్రిల్ 22: ముకేశ్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్‌ఐఎల్).. గత ఆర్థిక సంవత్సరం (2015-16) చివరి త్రైమాసికం, ఈ ఏడాది జనవరి- మార్చిలో దుమ్మురేపే లాభాలను ప్రకటించింది. ఎనిమిదేళ్లకుపైగా కాలంలో ఎన్నడూలేనంత స్థాయిలో లాభాలను పొందింది. నిరుడుతో పోల్చితే 16 శాతం వృద్ధిచెంది 7,398 కోట్ల రూపాయల లాభాలను అందుకున్నట్లు శుక్రవారం ప్రకటించింది.

04/23/2016 - 04:41

న్యూయార్క్, ఏప్రిల్ 22: అమెరికా పర్యటనలో ఉన్న కేంద్ర విద్యుత్, బొగ్గు, నూతన, పునరుత్పాదక శక్తి శాఖల మంత్రి పియూష్ గోయల్.. పలు ప్రైవేట్ ఈక్విటీ సంస్థల అధిపతులను, వివిధ శాఖల ప్రతినిధులను కలిశారు. ఈ మేరకు కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ శుక్రవారం తెలియజేసింది.

04/23/2016 - 04:36

విశాఖపట్నం, ఏప్రిల్ 22: విశాఖ కేంద్రంగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటి), పర్యాటక రంగాలను పెద్దఎత్తున ప్రోత్సహించేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోనుందని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌పి ఠక్కర్ స్పష్టం చేశారు. ఐటి, పర్యటక రంగాల ప్రతినిధులు, అధికారులతో విశాఖలో శుక్రవారం సమావేశమైన ఆయన పలు అంశాలను ప్రస్తావించారు.

Pages