S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

04/27/2016 - 06:06

న్యూఢిల్లీ, ఏప్రిల్ 26: ప్రభుత్వరంగ జల విద్యుదుత్పాదక సంస్థ ఎన్‌హెచ్‌పిసిలో 11.36 శాతం వాటా బుధవారం విక్రయానికొస్తోంది. ఒక్కో షేర్ విలువ 21.75 రూపాయలుగా నిర్ణయించింది ప్రభుత్వం. దీంతో ఈ వాటా అమ్మకంతో ఖజానాకు 2,700 కోట్ల రూపాయలకుపైగా నిధులు చేరనున్నాయి. ఎన్‌హెచ్‌పిసిలో ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వానికి 85.96 శాతం వాటా ఉంది.

04/27/2016 - 06:06

న్యూఢిల్లీ, ఏప్రిల్ 26: థేశీయ ప్రైవేట్‌రంగ బ్యాంకుల్లో మూడు అతిపెద్ద బ్యాంకైన యాక్సిస్ బ్యాంక్ నికర లాభం.. గత ఆర్థిక సంవత్సరం (2015-16) చివరి త్రైమాసికం, ఈ ఏడాది జనవరి-మార్చిలో స్వల్పంగా తగ్గింది. గతంతో పోల్చితే 1 శాతం దిగజారి 2,154.28 కోట్ల రూపాయలుగా నమోదైంది. అంతకుముందు ఆర్థిక సంవత్సరం (2014-15) జనవరి-మార్చి త్రైమాసికంలో బ్యాంక్ లాభం 2,180.59 కోట్ల రూపాయలుగా ఉంది.

04/27/2016 - 06:05

ముంబయి, ఏప్రిల్ 26: దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం భారీ లాభాలను అందుకున్నాయి. బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ సెనె్సక్స్ తిరిగి 26 వేల స్థాయిని అధిగమించగా, నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ నిఫ్టీ మళ్లీ 7,900 మార్కును దాటింది. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు కోలుకోవడం, అమెరికా ఫెడ్ రిజర్వ్ సమావేశానికి సిద్ధమవుతుండగా ఐరోపా మార్కెట్లు లాభాల్లో కదలాడటం భారతీయ సూచీలను పరుగులు పెట్టించాయి.

04/26/2016 - 01:09

అల్ట్రాటెక్ సిమెంట్

04/26/2016 - 01:08

న్యూఢిల్లీ, ఏప్రిల్ 25: నగల వర్తకులు మళ్లీ సమ్మె బాట పట్టారు. ఢిల్లీతోసహా దేశవ్యాప్తంగా పలుచోట్ల సోమవారం బంద్ నిర్వహించారు. వెండియేతర ఆభరణాలపై విధించిన ఒక శాతం ఎక్సైజ్ సుంకాన్ని ప్రభుత్వం విరమించుకోవాలని డిమాండ్ చేశారు. అఖిల భారత సరఫ సంఘం ఉపాధ్యక్షుడు సురీందర్ కుమార్ జైన్ పిటిఐతో మాట్లాడుతూ ఢిల్లీతోపాటు దేశంలోని ప్రధాన నగరాల్లో జ్యుయెలరీ షోరూమ్‌లు మూతబడ్డాయన్నారు.

04/26/2016 - 01:08

వరదయ్యపాలెం, ఏప్రిల్ 25: మాండలెజ్ ఇండియా ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఆసియా-పసిఫిక్‌లోనే అతిపెద్ద తయారీ కేంద్రం మొదటి దశను చిత్తూరు, నెల్లూరు సరిహద్దు శ్రీసిటీ సెజ్‌లో సోమవారం ప్రారంభించింది. 190 మిలియన్ డాలర్ల పెట్టుబడితో రూపుదిద్దుకుంటున్న ఈ ప్లాంటు సంవత్సరానికి 60 వేల టన్నుల క్యాడబరీ డెయిరీ మిల్క్ చాక్లెట్లను ఉత్పత్తి చేయనుంది.

04/26/2016 - 01:11

న్యూఢిల్లీ, ఏప్రిల్ 25: ప్రపంచంలోనే అత్యంత ఖరీదైనదిగా భావిస్తున్న స్మార్ట్ఫోన్ ఒకటి త్వరలో మన ముందుకు రానుంది. వచ్చే నెలలో దీన్ని సిరిన్ ల్యాబ్స్ పరిచయం చేయనుంది. ‘సొలారిన్’ పేరిట మార్కెట్‌లోకి వస్తున్న ఈ ఫోన్ ధర ఆరు లక్షల రూపాయల పైనేనని తెలుస్తోంది. అవును.. ‘స్మార్ట్ఫోన్లలో రోల్స్ రాయిస్’గా అభివర్ణించబడుతున్న దీని ధర దాదాపు 10,000 డాలర్లు మరి.

04/26/2016 - 01:02

ముంబయి, ఏప్రిల్ 25: దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం నష్టాల్లో ముగిశాయి. బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ సెనె్సక్స్ 159.21 పాయింట్లు క్షీణించి 25,678.93 వద్ద స్థిరపడగా, నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ నిఫ్టీ 44.25 పాయింట్లు పడిపోయి 7,855.05 వద్ద నిలిచింది. అమెరికా ఫెడ్ రిజర్వ్, బ్యాంక్ ఆఫ్ జపాన్ సమావేశాల క్రమంలో అంతర్జాతీయ మార్కెట్ల నుంచి అందుకున్న బలహీన సంకేతాలు.. భారతీయ సూచీలను దెబ్బతీశాయి.

04/26/2016 - 01:01

చెన్నై, ఏప్రిల్ 25: దేశంలో నెలకొన్న ప్రస్తుత ఆర్థిక పరిస్థితులను ‘స్వర్ణ యుగం’గా అభివర్ణించారు ముఖ్య ఆర్థిక సలహాదారు అర్వింద్ సుబ్రమణ్యన్. దేశ ఆర్థిక వ్యవస్థకు వ్యతిరేకంగా, బాగోలేదన్న వార్తలకు దూరంగా ఉండాలని విద్యార్థులకు ఆయన పిలుపునిచ్చారు. ‘సవాళ్లను ఎదుర్కొంటూ వెళ్తున్న భారత్ వంటి అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఇది స్వర్ణ యుగమే.

04/26/2016 - 01:01

రాజమహేంద్రవరం, ఏప్రిల్ 25: మామిడి దిగుబడిపై ఈసారి ఎల్‌నినో ప్రభావం తీవ్రంగా చూపింది. కేవలం 60 శాతం మాత్రమే దిగుబడి దక్కింది. ముఖ్యంగా తూర్పు గోదావరి జిల్లా పరిధిలో విస్తారంగా పండే మామిడి ఈసారి దిగుబడి పడిపోవడంతో అనుబంధ పరిశ్రమలన్నీ కుదేలయ్యాయి. మార్కెట్‌లో మచ్చుకు కూడా మామిడి కనబడని పరిస్థితి దాపురించింది. ఎగుమతులు మృగ్యమవగా, స్థానిక మార్కెట్‌లో విపరీతంగా ధరలు పెరిగాయి.

Pages