S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

02/23/2020 - 23:43

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 23: భారత టెలికం రంగం బకాయిల ఊబిలో కొట్టుమిట్టాడుతున్నది. దీని నుంచి బయటపడేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నది. ఈ క్రమంలోనే ఆదివారం టెలికంతోపాటు వివిధ మంత్రిత్వ శాఖలకు చెందిన ఉన్నతాధికారులు సమావేశమై, ప్రస్తుత పరిస్థితులు, వాటిని అధిగమించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై సుదీర్ఘంగా చర్చించారు. అయితే, సమావేశం వివరాలను టెలికాం అధికారులు ఎవరూ బయటపెట్టలేదు.

02/23/2020 - 23:42

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 23: దేశంలోని ‘టాప్-10’ కంపెనీల జాబితాలోని ఆరు కంపెనీల మార్కెట్ విలువ గత వారం 29,487 కోట్ల రూపాయల మేర పతనమైంది. అత్యధికంగా నష్టపోయిన కంపెనీల్లో భారతీ ఎయిర్‌టెల్ అగ్రస్థానంలో ఉంది. టాటా కన్సల్టెన్సీ లిమిటెడ్ (టీసీఎస్), హెచ్‌డీఎఫ్‌సీ, హిందుస్థాన్ యూనీలివర్ లిమిటెడ్ (హెచ్‌యూఎల్), హెచ్‌డీఫ్‌సీ బ్యాంక్, రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (రిల్) కూడా నష్టాలను చవిచూశాయి.

02/23/2020 - 04:58

విశాఖపట్నం: విశాఖ నగరం పాలనా రాజధానిగా అవతరించనుంది. ఈ నేపథ్యంలో నగరం నుంచి వివిధ ప్రాంతాలకు అనుసంధానత పెరగాల్సిన తరుణంలో నానాటికీ దిగజారుతుండటం ఆందోళన కలిగిస్తోంది. అంతర్జాతీయ స్థాయి నగరంగా కీర్తినందుకుంటున్నప్పటికీ విమానయాన రంగంలో సర్వీసుల కుదింపు అటు పారిశ్రామిక వర్గాలను, ఇటు పర్యాటకులకు మింగుడుపడని అంశమే. విశాఖ నగరం నుంచి దేశంలోని వివిధ ప్రాంతాలకు నిత్యం 72 సర్వీసులు నడుస్తున్నాయి.

02/23/2020 - 02:26

న్యూఢిల్లీ: ప్రధాన్‌మంత్రి- కిసాన్ సమ్మాన్ నిధి (పీఎం-కిసాన్) పథకం కింద ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా రైతులకు రూ. 50,850 కోట్లు పంపిణీ చేసినట్టు కేంద్ర ప్రభుత్వం శనివారం తెలిపింది. రైతులు తమ వ్యవసాయ ఖర్చులు, గృహావసరాల కోసం ఈ డబ్బును వినియోగించుకుంటారు.

02/23/2020 - 01:45

వాషింగ్టన్, ఫిబ్రవరి 22: భారత్ ఆర్థికాభివృద్ధికి అమెరికా అనేక అవకాశాలు కల్పిస్తుందా? భారత్‌తో ఆర్థికాభివృద్ధి, సత్సంబంధాలు కొనసాగించేందుకు దేశాధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ సారథ్యంలోని పరిపాలనా యంత్రాంగం కృషి చేస్తుందా? ప్రస్తుతం దేశమంతటా ఇదే చర్చ కొనసాగుతున్నది.

02/23/2020 - 01:37

హైదరాబాద్: రాష్ట్రప్రభుత్వ ఉద్యోగులకు వెంటనే పీఆర్‌సీ (వేతన సవరణ సంఘం) సిఫార్సులను అమలు చేయాలని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌కు బహిరంగ లేఖ రాశారు. రాష్ట్రంలోని 4 లక్షల మంది ఉపాధ్యాయ, ఉద్యోగులు, సుమారు 3 లక్షల పెన్షనర్లకు వర్తించే పీఆర్‌సీని ఆశించిన రీతిలో ఫిట్‌మెంట్‌తో వెంటనే ప్రకటించాలని ఆయన కోరారు.

02/23/2020 - 05:17

హైదరాబాద్: దేశ అవసరాల కోసం సింగరేణి బొగ్గు గనుల నుంచి బొగ్గు తవ్వకాల కోసం 2020-2021 ఆర్థిక సంవత్సరంలో 3 వేల కోట్ల బడ్జెట్‌కు సంస్థ ఆమోదించింది. ఈ నిధులతో 675 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తితో పాటు సరఫరా చేయాలని సంస్థ నిర్ణయించింది. శనివారం హైదరాబాద్ సింగరేణి భవన్‌లో సంస్థ డైరెక్టర్లతో శనివారం ఏర్పాటు చేసిన ఉన్నతస్థాయి సమావేశానికి సీఎండీ శ్రీధర్ హాజరయ్యారు.

02/21/2020 - 04:29

ముంబయి, ఫిబ్రవరి 20: అంతర్జాతీయ సూచీలు ప్రతికూల ధోరణును ప్రదర్శించడంతో, దాని ప్రభావంతో భారత స్టాక్ మార్కెట్లు కూడా నష్టాల్లోకి జారుకున్నాయి. బాంబే స్టాక్ ఎక్ఛ్సేంజ్ (బీఎస్‌ఈ)లో సెన్సెక్స్ 152.88 పాయింట్లు నష్టపోయి, 41,170.12 పాయింట్లకు పడిపోయింది. అదే విధంగా జాతీయ స్టాక్ ఎక్ఛ్సేంజ్ (ఎన్‌ఎస్‌ఈ)లో నిఫ్టీ 45.05 పాయింట్లు పతనమై 12,080.85 పాయింట్ల వద్ద ముగిసింది.

02/21/2020 - 02:11

రాయ్‌పూర్, ఫిబ్రవరి 20: వచ్చే నెలలో వంట గ్యాస్ (ఎల్‌పీజీ) ధరలు తగ్గే అవకాశాలున్నాయని కేంద్ర పెట్రోలియం, సహజ వాయువులు, ఉక్కు శాఖల మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గురువారం నాడిక్కడ తెలిపారు. చత్తీస్‌గఢ్‌లో రెండు రోజుల పర్యటన నిమిత్తం ఇక్కడి స్వామి వివేకానంద విమానాశ్రయానికి చేరుకున్న ఆయన విలేఖరుల సమావేశంలో మాట్లాడారు.

02/20/2020 - 23:35

హైదరాబాద్, ఫిబ్రవరి 20: దేశ అవసరాల కోసం 2024 నాటికి సింగరేణి బొగ్గు గనుల నుంచి దాదాపు 1000 మిలియన్ల టన్నుల బొగ్గు ఉత్పత్తి లక్ష్యంగా ప్రణాళికలతో సింగరేణి వ్యూహాత్మకంగా ముందకు అడుగులు వేస్తోంది. బొగ్గు ఉత్పత్తులపై దేశ వ్యాప్తింగా వస్తున్న సవాళ్లను అధికమించడానికి కేంద్ర బొగ్గు మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో గుజరాత్ కేవడియాలో‘ చింతన్ శిబర్’ మేథోమథన్ కార్యక్రమం జరిగింది.

Pages