S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

03/25/2016 - 17:58

నెల్లూరు: ఇక్కడి పెన్నా నదిలో మునిగి ముగ్గురు విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. ఓ ప్రైవేటు పాఠశాలలో చదువుతున్న తొమ్మిదో తరగతి విద్యార్థులు ఫైజుద్దీన్, లతి, వర్షిత్ శుక్రవారం ఉదయం రంగనాథస్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలను చూసేందుకు వచ్చారు. ఆలయంలోకి వెళ్లే ముందు పెన్నా నదిలో స్నానం చేసేందుకు దిగారు. నీట మునిగిన వీరు ఈత రాకపోవడంతో మరణించారు.

03/25/2016 - 12:48

గుంటూరు: అమరావతి ప్రాంతంలో ఎపి సిఎం చంద్రబాబు శుక్రవారం పర్యటిస్తున్న సందర్భంగా సిపిఎం నేతలను ముందస్తుగా పోలీసులు అరెస్టు చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. దీంతో సిపిఎం నేతలు, కార్యకర్తలు పోలీస్ స్టేషన్‌లోనే ఆందోళనకు దిగారు.

03/25/2016 - 12:46

విజయవాడ: గుడ్ ఫ్రైడే సందర్భంగా విజయవాడ వద్ద గుణదల చర్చిలో ప్రత్యేక ప్రార్ధనలు చేశారు. నగర వీధుల్లో పలుచోట్ల క్రైస్తవులు ర్యాలీలు జరిపారు. విశాఖ, రాజమండ్రితో పాటు మరికొన్ని చోట్ల కూడా శాంతిర్యాలీలు నిర్వహించారు.

03/25/2016 - 12:45

తిరుపతి: చిత్తూరు జిల్లా నాగపట్ల అటవీప్రాంతంలో శుక్రవారం ఉదయం పోలీసులు ఎర్రచందనం స్మగర్ల కోసం విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టారు. తమకు తారసపడిన ఇద్దరు కూలీలను పోలీసులు అరెస్టు చేసి గొడ్డళ్లు, రంపాలను స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల రాకను గమనించి 16 మంది కూలీలు పరారయ్యారు.

03/25/2016 - 05:21

హైదరాబాద్, మార్చి 24: ఆంధ్రప్రదేశ్‌లో పౌరసరఫరాల శాఖ ఆధ్వర్యంలో పని చేస్తున్న ఈ-పోస్ విధానాన్ని పర్యవేక్షించేందుకు గాను మహిళా, శిశు సంక్షేమ ఆధ్వర్యంలో రాష్ట్ర, జిల్లా, మండల స్థాయి కమిటీలను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

03/25/2016 - 05:30

హైదరాబాద్, మార్చి 24: రోడ్లు,డ్రైనేజీ వంటి వౌలిక సదుపాయాలతోనే రానున్న రోజుల్లో గృహనిర్మాణం జరపాలని ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబునాయుడు అధికారులను ఆదేశించారు. ఏప్రిల్ 8 నుంచి ఇంటింటా ఉగాది, ఇంటికి పునాది కార్యక్రమాన్ని ప్రారంభించడానికి సన్నాహాలు చేయాలని ఆదేశించారు.

03/25/2016 - 05:18

శ్రీకాకుళం, మార్చి 24: జిల్లాలోని ప్రధాన దేవాలయాల అర్చకులు ఆందోళన బాట పట్టారు. జిల్లా అర్చకుల సంఘం ఆధ్వర్యంలో గురువారం అర్చకులంతా భిక్షాటనతో నిరసన నిర్వహించారు. అరసవల్లి, శ్రీకూర్మం, శ్రీముఖలింగం, రావివలస, ఉమారుద్ర కోటేశ్వర ఆలయాల అర్చకులు దేవాదాయశాఖ అనుచిత వైఖరి, ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలకు నిరసనగా ఉత్తరాంధ్ర అర్చక సంఘం సూచన మేరకు గురువారం జిల్లా కేంద్రంలో నిరసన ప్రదర్శన చేసారు.

03/25/2016 - 02:26

కాకినాడ, మార్చి 24: మాతా-శిశు ఆరోగ్య పరిరక్షణ కోసం, పౌష్టికాహారాన్ని అందించడానికి మహిళా-శిశు సంజీవని మిషన్ పేరుతో వినూత్న పథకాన్ని తూర్పు గోదావరి జిల్లాలో ప్రభుత్వ యంత్రాంగం ప్రయోగాత్మకంగా అమలుచేస్తోంది. ఏజన్సీ, మారుమూల గ్రామాల్లో మాతా-శిశు ఆరోగ్య పరిరక్షణ కోసం పౌష్టికాహారాన్ని అందించడానికి ఉద్దేశించిన ఈ పథకాన్ని ప్రభుత్వ యంత్రాంగం-యునిసెఫ్ సంయుక్తంగా అమలుచేస్తున్నాయి.

03/25/2016 - 02:25

విజయవాడ, మార్చి 24: రాష్ట్రంలో అప్పుడే వేసవికాలం సమీపించినందున ప్రజలెవ్వరూ మంచినీటి కోసం ఇబ్బంది పడకుండా ముందస్తు చర్యలు చేపట్టామని రాష్ట్ర జలవనరులశాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. అందుబాటులోవున్న నీటిని సమర్ధవంతంగా పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. స్థానిక జలవనరులశాఖ కార్యాలయంలో ఉన్నతాధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు.

03/25/2016 - 02:25

విశాఖపట్నం, మార్చి 24: రాష్ట్రంలోని వివిధ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల్లో ఎన్టీఆర్ వైద్య సేవలు యథాతథంగా కొనసాగుతాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ స్పష్టం చేశారు. చాలాకాలంగా పేరుకుపోయిన బకాయిల చెల్లింపు, సేవల రుసుం పెంచకపోతే శుక్రవారం నుంచి ఈ పథకం కింద వైద్య సేవలను నిలిపివేస్తామని ఆంధ్రప్రదేశ్ స్పెషాలిటీ హస్పిటల్స్ అసోసియేషన్ ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేసింది.

Pages