-
విజయవాడ, ఏప్రిల్ 13: రాష్ట్ర ఎన్నికల కమిషన్ వ్యవహారాల్లో తాజాగా చోటుచేసుకున్న
-
గుంటూరు, ఏప్రిల్ 13: స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేసి కరోనా మహమ్మారి నుంచ
-
విజయవాడ: కరోనా వైరస్ సోకిన బాధితులకు ఎయిమ్స్ వైద్యులతో మాట్లాడి అత్యుత్తమ వైద
-
విజయవాడ: రాష్ట్రంలో సోమవారం సాయంత్రానికి 439 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
ఆంధ్రప్రదేశ్
విశాఖ: ప్రాజెక్టులు పూర్తయితే చంద్రబాబుకు మంచిపేరు వస్తుందన్న కక్షతో వైకాపా అధినేత జగన్ పోలవరం ప్రాజెక్టుపై తప్పుడు ప్రచారం చేస్తున్నట్లు ఎపి మంత్రి దేవినేని ఉమ అన్నారు. పోలవరం నిర్వాసితులను రెచ్చగొడుతూ రాజకీయంగా పబ్బం గడుపుకునేందుకు జగన్ యత్నించడాన్ని ప్రజలు క్షమించరన్నారు.
విశాఖ: వేతనాలు పెంచుతామని గతంలో ఇచ్చిన హామీని యాజమాన్యం పట్టించుకోవడం లేదని నిరసిస్తూ అచ్యుతాపురంలోని బ్రాండిక్స్ సంస్థ ఎదుట శనివారం నాడు మహిళా కార్మికులు మళ్లీ ఆందోళన ప్రారంభించారు. ఉద్రిక్తత ఏర్పడడంతో పోలీసులు జోక్యం చేసుకుని సుమారు 300 మంది మహిళా కార్మికులను అరెస్టు చేశారు. తమపట్ల పోలీసులు దురుసుగా ప్రవర్తించారని మహిళా కార్మికులు ఆరోపించారు.
హైదరాబాద్: వైకాపాకు చెందిన కొంతమంది ఎమ్మెల్యేలు శనివారం ఇక్కడ ఎపి అసెంబ్లీలో స్పీకర్ కోడెల శివప్రసాదరావును కలిశారు. టిడిపిలో చేరిన తమ పార్టీ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని రాజేంద్రనాథ్ రెడ్డి, విశే్వశ్వర రెడ్డి తదితరులు స్పీకర్ను కోరారు. రాజీనామాలు చేయించాకే ఎమ్మెల్యేలను టిడిపిలో చేర్చుకోవాలన్నారు.
కర్నూలు: ఎపికి ప్రత్యేక హోదాపై కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు, సిఎం చంద్రబాబు ప్రజలను మోసగిస్తున్నారని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఆరోపించారు. ప్రత్యేక హోదా అవసరం లేదని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి స్పష్టం చేసినా వెంకయ్య ఎందుకు నోరుమెదపడం లేదని ఆయన ప్రశ్నించారు. ప్రత్యేకహోదాపై పోరాటం చేసేందుకు మే 2న విజయవాడలో వామపక్షాలు సమావేశమై కార్యాచరణ ప్రకటిస్తాయన్నారు.
హైదరాబాద్: అడ్డగోలుగా రాష్ట్రాన్ని విభజించి గతంలో కాంగ్రెస్ పార్టీ ఘోరమైన తప్పు చేసిందని, ప్రత్యేకహోదా హామీని విస్మరించి నేడు బిజెపి అలాంటి తప్పుచేయకూడదని తాను కోరుకుంటున్నానని జనసేన పార్టీ అధినేత, సినీనటుడు పవన్కల్యాణ్ పేర్కొన్నారు. ఎపికి ప్రత్యేకహోదా అవసరం లేదంటూ కేంద్ర హోం శాఖ సహాయమంత్రి చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ పవన్ తన మనోభావాలను ట్విట్టర్లో పోస్ట్ చేశారు.
విశాఖ: విశాఖ జిల్లా రోలుగుంట వద్ద శనివారం ఓ పెళ్లివ్యాన్ బోల్తాపడి ఇద్దరు మరణించారు. ఈ ఘటనలో గాయపడిన పదిమందిని ఆస్పత్రికి తరలించారు.
విశాఖ: రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థను అన్నివిధాలా ఆధునీకరిస్తున్నామని ఎపి సిఎం చంద్రబాబు తెలిపారు. ఆయన శనివారం ఇక్కడ పోలీస్ కమిషనరేట్ కొత్త భవనాన్ని, కమాండ్ కంట్రోల్ వ్యవస్థను ప్రారంభించారు. డిజిపి రాముడు, అదనపు డిజి ఠాకూర్, పలువురు ఎమ్మెల్యేలు, టిడిపి నాయకులు హాజరయ్యారు.
విజయనగరం: ఎపికి ప్రత్యేకహోదా ఇస్తేనే బిజెపి పట్ల జనంలో విశ్వసనీయత ఉంటుందని టిడిపి నేత గద్దె బాబూరావు అన్నారు. బిజెపి, టిడిపి కలిసి పనిచేస్తేనే రాష్ట్రం పురోగమిస్తుందని, ఒంటరిగా పోటీ చేస్తే బిజెపి ఒక్క చోట కూడా గెలవలేదన్నారు.
విజయవాడ: విభజన చట్టంలో హామీలను, ప్రత్యేక హోదా డిమాండ్ను తీర్చేలా ప్రధాని మోదీ కృషి చేస్తారన్న నమ్మకం తమకు ఉందని ఎపి హోంమంత్రి చినరాజప్ప శనివారం ఇక్కడ విలేఖరులతో అన్నారు. ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అని ఆయన అన్నారు. దీన్ని సాధించేందుకు టిడిపి శక్తివంచన లేకుండా కృషి చేస్తుందన్నారు. బిజెపితో తమ పొత్తు 2019 ఎన్నికల్లోనూ కొనసాగుతుందన్నారు.
విశాఖ: ఎపికి ప్రత్యేకహోదా ఇచ్చేవరకూ తాము కేంద్రంతో పోరాడతామని వైకాపా నేత బొత్స సత్యనారాయణ శనివారం ఇక్కడ మీడియాకు తెలిపారు. ప్రత్యేకహోదా హామీపై బిజెపికి చిత్తశుద్ధి లేదన్నారు. రాష్ట్రంలో కరవు పరిస్థితులున్నా ప్రభుత్వం స్పందించనందుకు నిరసనగా మే 2న అన్ని జిల్లాల్లో ఆందోళన కార్యక్రమాలు చేపడతామన్నారు. రాజీనామాలు చేయించాకే వైకాపా ఎమ్మెల్యేలను టిడిపిలో చేర్చుకోవాలన్నారు.