-
విజయవాడ, ఏప్రిల్ 13: రాష్ట్ర ఎన్నికల కమిషన్ వ్యవహారాల్లో తాజాగా చోటుచేసుకున్న
-
గుంటూరు, ఏప్రిల్ 13: స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేసి కరోనా మహమ్మారి నుంచ
-
విజయవాడ: కరోనా వైరస్ సోకిన బాధితులకు ఎయిమ్స్ వైద్యులతో మాట్లాడి అత్యుత్తమ వైద
-
విజయవాడ: రాష్ట్రంలో సోమవారం సాయంత్రానికి 439 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
ఆంధ్రప్రదేశ్
విజయవాడ, జూన్ 24: స్విస్ ఛాలెంజ్ పద్ధతిలో అమరావతి ప్రాంతంలో రైతుల నుంచి సేకరించిన భూములను లాభదాయకమైన పద్ధతిలో విదేశీ కంపెనీలకు కేటాయించేందుకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి పరిశీలించకుండానే ఈ విధానానికి ముఖ్యమంత్రి ఆమోదం తెలిపారంటూ వస్తున్న అభియోగాలను సిఎం తోసిపుచ్చారు. మొత్తం పద్ధతిగానే జరుగుతున్నదని వివరించారు.
విజయవాడ, జూన్ 24: తొమ్మిది నెలల పసిపాప జ్ఞానసాయికి వచ్చిన కష్టానికి ఏపి సిఎం చంద్రబాబు చలించిపోయారు. కాలేయ వ్యాధితో బాధపడుతున్న ఈ చిన్నారిని ఆదుకునేందుకు ఎంత డబ్బు ఖర్చయినా వెనుకాడబోమని హామీ ఇచ్చారు. ములకలపల్లి మండలం ఆర్ఎస్ కొత్తపల్లి గ్రామంలో నిరుపేదలైన జె రమణప్ప, సరస్వతి దంపతుల బిడ్డ జ్ఞానసాయి పుట్టిన నాటి నుంచి కాలేయ సమస్యతో బాధపడుతోంది. వైద్య శాస్త్ర పరిభాషలో బిలిరియా అట్రాసియా అంటారు.
విజయవాడ, జూన్ 24: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు సమాచార పౌర సంబంధాల శాఖ, వైద్య డైరెక్టరేట్ కార్యాలయం, సిబ్బంది వేర్వేరు బస్సులలో శుక్రవారం నగరానికి చేరుకున్నారు. వీరికి ఎన్జీవో సంఘ పశ్చిమ కృష్ణా అధ్యక్షుడు విద్యాసాగర్ నేతృత్వం లో నాయకులు పుష్పగుచ్ఛాలు ఇచ్చి ఘనస్వాగతం పలికారు.
విజయవాడ, జూన్ 24: విదేశీ పెట్టుబడుల కోసం పలు కంపెనీలతో ఒప్పందాలను ఖరారు చేసుకునేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నేతృత్వంలో ప్రతినిధి బృందం శనివారం రాత్రి ఢిల్లీ నుంచి చైనాకు బయలుదేరి వెళ్లనుంది. ఈ పర్యటన ఖర్చుల కోసం కోటి 20 లక్షలు మంజూరు చేసిన ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన కోటి రూపాయలు విడుదల చేసింది.
చిత్తూరు: మొలకలచెరువు మండలంలోని ఆర్ఎస్ కొత్తపల్లెకు చెందిన రమణప్ప, సరస్వతి దంపతుల కుమార్తె ఎనిమిది నెలల జ్ఞానసాయి చికిత్సకు అయ్యే ఖర్చంతా ప్రభుత్వమే భరిస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, వైద్య ఆరోగ్య శాఖమంత్రి కామినేని ప్రకటించారు. దీంతో ఆ గ్రామంలోని ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. జ్ఞానసాయికి పుట్టుకతో కాలేయ సంబంధిత వ్యాధి ఉంది. ఇప్పటికే లక్షలు ఖర్చు చేసి చికిత్స చేయించినా ఫలితం దక్కలేదు.
కర్నూలు: ఓ వివాహితపై సామూహిక అత్యాచారం చేసిన ముగ్గురిని పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. ఇక్కడికి సమీపంలోని ఇ.తాండ్రపాడులో ఓ మహిళపై అదే గ్రామానికి చెందిన ముగ్గురు కొద్దిరోజుల క్రితం అత్యాచారం చేశారు. ఈ విషయం చెప్పడానికి భయపడిన ఆమె తన భర్తకు చెప్పకుండా బంధువుల ఇంటికి వెళ్లింది. భార్య కోసం గాలిస్తున్న భర్తకు అసలు విషయం తెలియడంతో పోలీసులు రంగప్రవేశం చేసి ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు.
విజయవాడ: స్విస్ ఛాలెంజ్ పద్థతిలో ఏపీ రాజధాని నిర్మాణానికి కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన శుక్రవారం జరిగిన ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది.సింగపూర్ లాంటి నగరాన్ని నిర్మిస్తామని, రాజధాని నిర్మాణానికి జపాన్ కంపెనీ ముందుకు వచ్చిందని, చర్చలు జరుపుతున్నట్లు ముఖ్యమంత్రి తెలిపారు.
విశాఖ: పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కోస్తాంధ్ర తీరంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని, ఇది రాబోయే 72 గంటల్లో అల్పపీడనంగా మారే అవకాశం ఉందని ఇక్కడి వాతావరణ కేంద్రం శుక్రవారం తెలిపింది. దీంతో కృష్ణా, గుంటూరు, నెల్లూరు, ప్రకాశం జిల్లాలతో పాటు రాయలసీమ ప్రాంతంలో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది.
తిరుమల: తిరుమలలో శుక్రవారం 15 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 6గంటలు, కాలినడక భక్తులకు 4గంటలు, ప్రత్యేక ప్రవేశదర్శనానికి 2గంటల సమయం పడుతోంది. భక్తుల రద్దీ సాధారణంగా ఉంది.
విజయవాడ: ఎపి సిఎం చంద్రబాబు అధ్యక్షతన మంత్రిమండలి సమావేశం శుక్రవారం ఉదయం ప్రారంభమైంది. ఎపిలో పెట్టుబడులు పెట్టే విదేశీ సంస్థలకు భూముల కేటాయింపు, ప్రైవేటు రంగంలో వెటర్నరీ, అగ్రికల్చర్ , హార్టీకల్చర్ కళాశాలల ఏర్పాటుకు సమావేశంలో అనుమతులు మంజూరు చేసే అవకాశం ఉంది. రైతులకు రుణమాఫీ, పంటల పరిస్థితులు తదితర అంశాలపై కూడా చర్చ జరుగుతుందని సమాచారం.